Andhra News: ఏపీకి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అందుకోసమే..

Andhra News: ఏపీకి రానున్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. అందుకోసమే..


ఏపీకి కేంద్రమంత్రులు, బీజేపీ అగ్రనేతల పర్యటనలు కొనసాగుతున్నాయి. ఇటీవలే విశాఖపట్నంలో పర్యటించిన ప్రధాని మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఇక ఇప్పుడు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా.. ఏపీలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆదివారం కృష్ణా జిల్లాలోని గన్నవరం సమీపంలో నిర్మించిన ఎన్డీఆర్ఎఫ్, ఎన్ఐడీఎం ప్రాంగణాలను అమిత్ షా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరవుతారు. ఈ పర్యటన కోసం శనివారం రాత్రి ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకోనున్న అమిత్‌ షాకు ఘన స్వాగతం పలకాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఇక అక్కడి నుంచి ఉండవల్లిలోని ఏపీ సీఎం చంద్రబాబు నివాసానికి అమిషాకు చేరుకుంటారు. అక్కడ ఆయనకు చంద్రబాబు విందు ఏర్పాటు చేశారు. తర్వాత, విజయవాడలోని హోటల్‌కు చేరుకుని అక్కడ బస చేస్తారు. అమిత్ షా పర్యటన ఏర్పాట్లను ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి పర్యవేక్షిస్తున్నారు. అమిత్‌ షా ప్రారంభించే NIDM, NDRF ప్రాంతాలను పరిశీలించారు. అలాగే సభ తదితర అంశాలపై అందుబాటులో ఉన్న అధికారులుతో చర్చించారు. అమిత్ షా సభా ప్రాంగణానికి చేరుకుని… వెళ్లేంత వరకు జరిగే కార్యక్రమాల వివరాలుపై కొద్దిసేపు అధికారులుతో పురంధేశ్వరి సమీక్ష నిర్వహించారు.

మరోవైపు మోదీ పర్యటించన వారం గ్యాప్‌లోనే అమిత్ షా కూడా వస్తుండటంతో.. రాష్ట్రంలోని ఎన్డీఏ నేతల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. అమిత్ షాకు ఘన స్వాగతం పలికేందుకు.. ఎన్డీఏ నేతలు రెడీ అయ్యారు. కేంద్రం మంత్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *