
ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. అమరావతిలో క్వాంటం కంప్యూటర్, ఏఐ సంస్థలకు భూముల కేటాయింపు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏడాది పాలనపై చర్చించిన మంత్రివర్గం.. ఇప్పటివరకూ సాధించిన లక్ష్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. మంత్రులు ప్రజలకు మరింత దగ్గర కావాలని సీఎం చంద్రబాబు సూచించారు. అలాగే వనమహోత్సవంతో పాటు యోగా డేను ప్రపంచ రికార్డ్ నెలకొప్పేలా నిర్వహించాలని నిర్ణయించింది. రాజధాని అమరావతి నిర్మాణంలో భాగంగా సీఆర్డీఏ నిర్ణయాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే పలు సంస్థలకు భూకేటాయింపులు.. ఉద్దానంలో రక్షిత మంచినీటికి నిధుల…