
జగన్కు లోకేష్ సవాల్..! ఆ కంపెనీకి భూమి కేటాయించినట్లు నిరూపిస్తూ..
ఏపీ రాజకీయాల్లో రచ్చకు కారణమవుతున్న ఉర్సా భూముల వ్యవహారంపై పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది. అనేక అంశాల్లో అవినీతి జరుగుతోందంటూ కూటమి ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న వైఎస్ జగన్.. భూముల కేటాయింపు అంశంలోనూ చంద్రబాబు ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉర్సా కంపెనీకి భూములు కేటాయించడాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. విశాఖ లాంటి నగరంలో రూపాయికి ఇడ్లీ వస్తుందో లేదో కానీ.. రూపాయికి మూడు వేల కోట్ల రూపాయిల భూములు ఇస్తున్నారని విమర్శించారు. ఊరు…