
మా నీళ్లు ఇప్పటివరకు బయటకు వెళ్లాయి.. ఇకపై భారతీయులకే దక్కుతాయిః ప్రధాని మోదీ
పాకిస్తాన్తో దశాబ్దాల నాటి సింధు జల ఒప్పందాన్ని రద్దు చేయాలని భారతదేశం తీసుకున్న నిర్ణయం తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం(మే 06) తన తొలి బహిరంగ వ్యాఖ్యలు చేశారు. భారతదేశానికి కేటాయించిన నీరు ఇప్పుడు దేశంలోనే ఉంటుందని, దానిని ఉపయోగిస్తామని ఆయన అన్నారు. ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ, “ఇంతకుముందు భారతదేశానికి చెందిన నీరు బయటకు పోయేది. ఇప్పుడు భారతదేశ నీరు భారతదేశానికి అనుకూలంగా ప్రవహిస్తుంది, భారతదేశానికి అనుకూలంగా ఉంటుంది….