
Air India: ఎయిర్ పోర్ట్పై క్షిపణి దాడి.. విమానాల రాకపోకలు నిలిపివేసిన ఎయిర్ ఇండియా!
ఈ ఉదయం బెన్ గురియన్ విమానాశ్రయంలో హౌతీ తిరుగుబాటుదారులు క్షిపణి దాడి చేసిన నేపథ్యంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్కు విమానాలను ఎయిర్ ఇండియా రాబోయే రెండు రోజుల పాటు నిలిపివేసింది. ఈ సంఘటన తర్వాత ఢిల్లీ నుండి టెల్ అవీవ్కు వెళ్లే విమానాన్ని అబుదాబికి మళ్లించామని ఎయిర్లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టిక్కెట్లు ఉన్నవారికి మినహాయింపు, రీషెడ్యూల్ చేసుకునే అవకాశం కల్పిస్తామని ఎయిర్ ఇండియా హామీ ఇచ్చింది. ప్రయాణీకులు, సిబ్బంది భద్రత కోసమే ఈ…