
AP News: మతిస్థిమితం లేదు.. నడుచుకుంటూ నేపాల్కు.. కట్ చేస్తే 30 ఏళ్ల తర్వాత
పైన ఫోటోలో ఉన్న వ్యక్తి పేరు… ఇమ్మానుయేల్. మతిస్థిమితం లేక 30 ఏళ్ల క్రితం కుటుంబ సభ్యులకు దూరమయ్యాడు. ఎక్కడెక్కడో తిరుగుతూ నేపాల్కు చేరుకున్నాడు. అక్కడ మానవీయ సేవా కేంద్ర నిర్వాహకులు చేరదీశారు. ఆశ్రమంలోనే ఉంచుకొని వైద్యం చేయించారు. అతను ఎవరో ఎక్కడి నుంచి వచ్చాడో అతి కష్టం మీద తెలుసుకున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణానికి చెందిన వాడిగా గుర్తించి పట్టణంలో ఉన్న వేదాస్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులతో మాట్లాడి ఎమ్మిగనూరుకు తీసుకొచ్చారు. ఎమ్మిగనూరులోని…