
దైవ మహత్యమా..! లేక నిర్మాణ నైపుణ్యమా..! కార్తీక మాసం మొదటి రోజు శివాలయంలో వింత.. పోటెత్తిన భక్తులు
కార్తీక మాసం మొదటి రోజు శైవ క్షేత్రంలో వింత చోటు చేసుకుంది. స్వామివారి గర్భగుడిలోని శివలింగాన్ని సూర్యకిరణాలు తాకడంతో అక్కడి భక్తుల్లో ఎనలేని ఆధ్యాత్మికత ఉప్పొంగింది. ఇది శివుడి మహాత్యమా లేక నిర్మాణ నైపుణ్యమా అంటూ ఉప్పొంగిపోతున్నారు శివ భక్తులు. కార్తీక మాసం మొదటి రోజు జరిగిన ఈ సంబరం ఆశ్చర్యాన్ని చూసేందుకు ఆలయానికి తండోపతండాలుగా తరలివచ్చారు. నంద్యాల జిల్లా సిరివెళ్లలోని శ్రీ ఓంకారేశ్వర ఆలయం ను 700 సంవత్సరాల క్రితం ప్రతాపరుద్ర మహారాజు కాలంలో శివలింగం ప్రతిష్టించారని…