హైదరాబాద్, జూన్ 9: ఒక మనిషి ప్రాణం తీయడమనేది సాధారణ విషయం కాదు.. అలాంటిది మరో మనిషి కోసం విచక్షణ మరిచి హత్యలు, ఖూనీలు చేసేవరకు దిగజారిపోతున్నామంటే నానాటికీ సమాజం ఏ దారిన వెళ్తుందో ఊహించలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడ జరిగింది కూడా అలాంటి సంఘటనే. స్నేహితుడు అని కూడా చూడకుండా ఓ ప్రబుద్ధుడు దారుణంగా హత్య చేసిన ఘటన పాతబస్తీ చాదర్ఘాట్ పరిధిలో కలకలం రేపింది.
హైదరాబాద్ నగరం పాతబస్తీ చాదర్ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం (జూన్ 7) సాయంత్రం ఖుదుష్ (30) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. ఓ యువతి విషయంలో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగిన ఘర్షణే ఈ దారుణ ఘటనకు కారణంగా తెలిసింది. హతుడు, నిందితుడు ఇద్దరూ రాజస్థాన్ రాష్ట్రంకు చెందినవారుగా గుర్తించారు. ఉపాధి నిమిత్తం రాజస్థాన్ నుంచి ఆ యువకులు హైదరాబాద్ వచ్చినట్లు పోలీసుల విచారణలో తేలింది. పైగా బక్రీద్ పర్వదినం రోజున ఈ సంఘటన జరగడంతో పాతబస్తీ ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది. సౌత్ ఈస్ట్ జోన్ డీసీపీ ఎస్.చైతన్య కుమార్ ఆధ్వర్యంలో చాదర్ఘాట్ పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సాహిల్ మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం పంపించారు. ప్రస్తుతం ఈ కేసుపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇవి కూడా చదవండి
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.