Champions Trophy: సమస్యల వలయంలో భారత జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే బిగ్ షాక్

Champions Trophy: సమస్యల వలయంలో భారత జట్టు.. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందే బిగ్ షాక్


Team India Players Injury Before Champions trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టును ప్రకటించారు. చాలా కాలం తర్వాత మహ్మద్ షమీ, హార్దిక్ పాండ్యా మళ్లీ వన్డే జట్టులోకి వచ్చారు. కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా కూడా జట్టులో ఉన్నారు. అయితే, ఈ నలుగురు ఆటగాళ్లు గత కొన్ని నెలలుగా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. వీరంతా ఛాంపియన్స్ ట్రోఫీలోని ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడటం దాదాపు ఖాయం. కానీ, వారి ఫిట్‌నెస్‌పై అతి విశ్వాసం వ్యక్తం చేయలేం. అందుకే టీమ్ ఇండియాకు పెద్ద ముప్పు పొంచి ఉంది. కీలక ఆటగాళ్లు గాయాల కారణంగా టీమ్ ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ క్యాంపెయిన్ పట్టాలు తప్పుతుందేమోనని అనిపిస్తోంది.

జస్ప్రీత్ బుమ్రా..

సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో జస్ప్రీత్ బుమ్రా వెన్ను నొప్పితో బాధపడ్డాడు. అనంతరం స్కానింగ్‌కు తరలించారు. అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో ఎంపికయ్యాడు. కానీ, ఈ టోర్నీలో అతని పరిస్థితి ఇంకా స్పష్టంగా లేదు. ఫిబ్రవరి 2న బుమ్రాను స్కాన్ చేసి, ఆ తర్వాత అతనిపై నిర్ణయం తీసుకోనున్నారు.

మహ్మద్ షమీ..

2023 వన్డే ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మహ్మద్ షమీ చీలమండ గాయంతో బాధపడ్డాడు. తరువాత అతనికి శస్త్రచికిత్స జరిగింది. అప్పటి నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలక్టర్లు అతనిపై విశ్వాసం వ్యక్తం చేశారు. గాయం నుంచి షమీ కోలుకున్నాడు. ఇటీవల అతను దేశవాళీ క్రికెట్‌లో బరిలోకి దిగాడు. అయితే దాదాపు 14 నెలల తర్వాత వన్డే క్రికెట్‌లో ఆడడం అతనికి అంత సులువు కాదు. అయితే అంతకంటే ముందు ఇంగ్లండ్‌తో జరిగే టీ20 సిరీస్‌ ద్వారా ఫిట్‌నెస్‌ నిరూపించుకునే ప్రయత్నం చేయనున్నాడు. టీ-20 జట్టులోకి కూడా ఎంపికయ్యాడు.

హార్దిక్ పాండ్యా..

ఛాంపియన్స్ ట్రోఫీ ద్వారా హార్దిక్ పాండ్యా 15 నెలలకు పైగా వన్డే క్రికెట్‌లోకి తిరిగి రానున్నాడు. హార్దిక్ కూడా గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. 19 అక్టోబర్ 2023న బంగ్లాదేశ్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో హార్దిక్ చీలమండ గాయంతో బాధపడ్డాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అంతర్జాతీయ వన్డే ఆడలేదు. కానీ, అతను దేశీయ క్రికెట్, ఐపీఎల్ 2024, టీ-20 ప్రపంచ కప్‌లో ఆడాడు. కానీ, ఛాంపియన్స్ ట్రోఫీని 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడతారు. నిరంతర గాయాల కారణంగా, హార్దిక్‌ను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టుకు వైస్ కెప్టెన్‌గా కూడా చేయలేదు. ఈ బాధ్యతను యువ ప్లేయర్ శుభ్‌మన్ గిల్‌కు అప్పగించారు.

కుల్దీప్ యాదవ్..

2024లో న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో టీమిండియా స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ గాయపడ్డాడు. అతను గజ్జల్లో గాయంతో ఇబ్బంది పడ్డాడు. తరువాత శస్త్రచికిత్స చేయించుకున్నాడు. అతను ఇప్పుడు ఈ గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాడు. జనవరి 22 నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే టీ20 సిరీస్‌తో పాటు, అతను ఛాంపియన్స్ ట్రోఫీ జట్టులో కూడా ఎంపికయ్యాడు. గాయం తర్వాత తిరిగి వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు తనను తాను నిరూపించుకోవడానికి కుల్దీప్‌కు మంచి అవకాశం ఉంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *