బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు నేటి నుంచి అడిలైడ్లో మొదలైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో పింగక్ బాల్ టెస్ట్లో ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ చేయనుంది. సిరీస్లో భారత్ 1-0 ఆధిక్యంలో ఉంది. పెర్త్ టెస్టులో భారత జట్టు 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. అడిలైడ్లో ఇరు జట్ల మధ్య ఇప్పటివరకు 13 మ్యాచ్లు జరగ్గా, భారత్ ఇక్కడ 2 గెలిచింది.
2020-21 మాదిరిగానే, ఈసారి కూడా అడిలైడ్లో డే-నైట్ టెస్టు జరగనుంది. పింక్ బాల్ టెస్ట్ కోసం ప్రాక్టీస్ చేయడానికి, ఆస్ట్రేలియా పీఎం-11తో భారత్ రెండు రోజుల వార్మప్ గేమ్ ఆడింది. అక్కడ భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రేపటి మ్యాచ్లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్ తిరిగి రానున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్లో వీరిద్దరూ బ్యాటింగ్ చేశారు.