IPL 2025: “ఆ జట్టులో అంతా స్వార్థపరులు, విషనాగులే”: ఆ ఐపీఎల్ టీంపై కోహ్లీ జిగిరీ దోస్త్ షాకింగ్ కామెంట్స్..

IPL 2025: “ఆ జట్టులో అంతా స్వార్థపరులు, విషనాగులే”: ఆ ఐపీఎల్ టీంపై కోహ్లీ జిగిరీ దోస్త్ షాకింగ్ కామెంట్స్..


IPL 2025: ఐపీఎల్ అంటేనే మిస్టర్ 360, ఏబీ డివిలియర్స్ పేరు ముందుగా గుర్తొస్తుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) తరపున విధ్వంసకర బ్యాటింగ్‌తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఏబీడీ, తన ఐపీఎల్ కెరీర్ ఆరంభంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్ (ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్) జట్టులో సభ్యుడిగా ఉన్నాడని చాలామందికి తెలియదు. 2008 నుంచి 2010 వరకు ఢిల్లీ తరపున ఆడిన ఏబీడీ, ఇటీవల తన ఆ జట్టు అనుభవాలపై చేసిన వ్యాఖ్యలు క్రికెట్ ప్రపంచంలో సంచలనం సృష్టించాయి.

“గందరగోళంగా ఢిల్లీ జట్టు “: ఏబీడీ

తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఏబీ డివిలియర్స్ మాట్లాడుతూ, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టులో తాను ఆడిన సమయంలో “విషపూరితమైన వ్యక్తులు” (Poisonous characters) ఉన్నారని వ్యాఖ్యానించారు. వారి పేర్లు చెప్పడానికి నిరాకరించినప్పటికీ, ఆ సమయంలో జట్టు వాతావరణం చాలా గందరగోళంగా (in shambles) ఉందని పేర్కొన్నాడు.

“నేను పేర్లు చెప్పడానికి ఇష్టపడను. కానీ, ఢిల్లీ డేర్‌డెవిల్స్ జట్టు అస్తవ్యస్తంగా ఉండేది. నిజంగానే. ఆ జట్టులో చాలా మంది విషపూరితమైన వ్యక్తులు ఉన్నారు” అని ఏబీడీ వెల్లడించారు. “చాలా మంది గొప్ప ఆటగాళ్లు కూడా ఉన్నారు. అందుకే ఇది నాకు తీపి, చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. గ్లెన్ మెక్‌గ్రాత్, డేనియల్ వెట్టోరి వంటి దిగ్గజాలతో గడిపిన సమయం నా కెరీర్‌లో, జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి” అని పేర్కొన్నాడు.

అంచనాలకు తగ్గ మద్దతు లభించలేదా?

ఏబీ డివిలియర్స్ తన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కెరీర్‌ను అంతగా గుర్తుపెట్టుకోకపోవడానికి కొన్ని కారణాలున్నాయి. 2009లో ఐపీఎల్ దక్షిణాఫ్రికాలో జరిగినప్పుడు, ఏబీడీ అద్భుతంగా రాణించి ఒక సెంచరీ కూడా సాధించాడు. ఆ సీజన్‌లో తాను జట్టుకు ముఖ్యమైన ఆటగాడిగా మారుతానని భావించినా, ఆ తర్వాత తనకు సరైన మద్దతు లభించలేదని ఏబీడీ ఆవేదన వ్యక్తం చేశాడు. 2011 మెగా ఆక్షన్‌కు ముందు జట్టు యాజమాన్యం తనను రిటైన్ చేసుకుంటామని చెప్పి, చివరకు వేలంలోకి వదిలేసిందని, ఇది తనకు ఆశ్చర్యం కలిగించిందని కూడా ఏబీడీ వివరించారు.

ఆర్సీబీకి రాక ఒక వరం..

ఢిల్లీ డేర్‌డెవిల్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఏబీ డివిలియర్స్ కెరీర్‌కు ఒక వరంగా మారింది. 2011లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అతడిని దక్కించుకుంది. ఆ తర్వాత ఐపీఎల్‌లో ఒక లెజెండ్‌గా, అభిమానుల ఆరాధ్య క్రికెటర్‌గా ఏబీడీ ఎదిగాడు. విరాట్ కోహ్లీతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పి, ఆర్సీబీకి ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు.

ఏబీ డివిలియర్స్ చేసిన ఈ వ్యాఖ్యలు ఐపీఎల్ జట్ల అంతర్గత వాతావరణం, ఆటగాళ్లపై దాని ప్రభావం గురించి చర్చకు దారితీశాయి. ఒక గొప్ప ఆటగాడు కూడా సరైన వాతావరణం లేకపోతే తన పూర్తి సామర్థ్యాన్ని ప్రదర్శించలేడనడానికి ఏబీడీ అనుభవమే ఒక నిదర్శనం.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *