IPL 2025: కావ్య పాపకు శనిలా దాపురించాడు.. కట్ చేస్తే.. అటు PSL, ఇటు IPLలో రప్పా.. రప్పలాడించాడు..

IPL 2025: కావ్య పాపకు శనిలా దాపురించాడు.. కట్ చేస్తే.. అటు PSL, ఇటు IPLలో రప్పా.. రప్పలాడించాడు..


రెండు వేర్వేరు దేశాలు, రెండు వేర్వేరు జట్లు.. రెండు అబ్దుల్ సమద్‌లు.. కానీ ఫలితం మాత్రం ఒకటే. మనం ఐపీఎల్, పీఎస్ఎల్ గురించి మాట్లాడుతున్నాం. నిజానికి, ఏప్రిల్ 19న ఓ ఇంటరెస్టింగ్ విషయం చోటు చేసుకుంది. అటు పాకిస్తాన్, ఇటు భారత్‌లలో జరిగిన రెండు టోర్నమెంట్‌లలోని మ్యాచ్‌లలోనూ అబ్దుల్ సమద్ బరిలోకి దిగాడు. అయ్యయ్యో.! పేరు ఇద్దరిది ఒకటే. కానీ మనుషులు మాత్రం ఇద్దరు. ఒక సమద్ రిషబ్ పంత్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్‌కు, మరొ సమద్ బాబర్ అజామ్ నేతృత్వంలోని పెషావర్ జల్మీకి గేమ్ ఛేంజర్‌గా నిలిచారు.

ఐపీఎల్‌లో మ్యాచ్‌ మలుపు తిప్పిన సమద్..

IPL 2025లో అబ్దుల్ సమద్ రిషబ్ పంత్ కెప్టెన్సీలో లక్నో సూపర్ జెయింట్స్ తరపున ఆడుతున్నాడు. ఈ జట్టుకు ఫినిషర్ పాత్ర పోషిస్తున్నాడు. చివరి ఓవర్లో పేలుడు ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోర్ అందిస్తున్నాడు. ఏప్రిల్ 19న కూడా అదే పని చేశాడు. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో 17.3 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు చేసింది. ఇన్నింగ్స్‌లో కేవలం 15 బంతులు మాత్రమే మిగిలి ఉన్న సమయంలో సమద్ బ్యాటింగ్‌కు దిగి కేవలం 10 బంతుల్లో 4 సిక్సర్లతో 30 పరుగులు చేశాడు. చివరి ఓవర్లో అతడు ఏకంగానాలుగు సిక్సర్లు కొట్టాడు. ఇది మ్యాచ్‌ స్వరూపాన్నే మార్చేసింది. 19వ ఓవర్ వరకు లక్నో జట్టు 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. కానీ సమద్ 4 సిక్సర్లు కొట్టడంతో చివరి ఓవర్లో 27 పరుగులు రాగా, LSG 180 పరుగుల గౌరవప్రదమైన స్కోర్‌కు చేరుకోగలిగింది. అతని ఇన్నింగ్స్ వల్ల లక్నో ఈ ఉత్కంఠభరితమైన మ్యాచ్‌ను 2 పరుగుల తేడాతో గెలుచుకుంది.

PSL ఆటగాడు అబ్దుల్ సమద్ తన బలాన్ని చూపించాడు..

PSLలో బాబర్ అజామ్ కెప్టెన్సీలోని పెషావర్ జల్మీ తరఫున పాకిస్తాన్ ఆటగాడు అబ్దుల్ సమద్ కూడా రఫ్ఫాడించాడు. నిజానికి, పెషావర్ మొదటి 15 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 143 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత సమద్ బ్యాటింగ్‌కు వచ్చి కేవలం 14 బంతుల్లో 3 సిక్సర్లు, 4 ఫోర్లతో 40 పరుగులు చేశాడు. అతని ఇన్నింగ్స్‌తో పెషావర్ జట్టు చివరి 5 ఓవర్లలో 84 పరుగులు చేసి 227 పరుగుల భారీ స్కోరును సాధించింది. అటు ముల్తాన్ సుల్తాన్స్ 107 పరుగులకే కుప్పకూలింది. దీంతో పెషావర్ జట్టు 120 పరుగుల తేడాతో మ్యాచ్‌ను గెలుచుకుంది.

కాగా, అటు ఐపీఎల్‌లోని అబ్దుల్ సమద్ మాత్రం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఉన్నప్పుడు ఎలాంటి మంచి ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. 10 కోట్లతో కావ్య మారన్ ఏరి కోరి అట్టిపెట్టుకుంటే నట్టేట ముంచేశాడంటూ ఫ్యాన్స్ ఏకిపారేస్తున్నారు. ఇక మెగా వేలంలో అబ్దుల్ సమద్‌ను కేవలం రూ. 4.2 కోట్లకే దక్కించుకుంది లక్నో.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *