
కాకినాడలోని పేలుడు కలకలం చెలరేగింది. బాలాజీ ఎక్స్పోర్ట్స్లో సోమవారం ఉదయం ఈ బ్లాస్ట్ జరిగింది. స్థానిక వార్పు రోడ్డులోని జై బాలాజీ ఎక్స్పోర్ట్స్లో పార్సిల్ దింపుతుండగా పెద్ద బ్లాస్ట్ జరిగింది. పేలుడు ధాటికి భారీ శబ్దం రావడంతో కార్మికులు అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని కాకినాడ GGHకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పేలుడు సంభవించేందుకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పార్శిల్లో ఏముంది అనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు.
ఓ కార్మికుడు పెద్ద పార్శిల్ను లారీ నుంచి తీసి భుజాన వేసుకుని కిందకు దించుతుండగా ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడం వీడియోలో స్పష్టంగా చూడవచ్చు. అందులో చిన్న పిల్లలు కాల్చే టపాసులు ఉన్నట్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.