మంజు వారియర్.. సినీ నటి, నృత్య కళాకారిణి, గాయని, నిర్మాత, రచయిత్రి కూడా.. ఈ బ్యూటీ ప్రధానంగా మలయాళ సినిమా రంగంలో ప్రసిద్ధి చెందింది. కేరళ, తమిళ, హిందీ సినిమాల్లో కూడా నటించి గుర్తింపు పొందింది. 1978 సెప్టెంబర్ 10న తమిళనాడులోని నాగర్కోయిల్లో జన్మించిన మంజు, 16 ఏళ్ల వయసులో 1995లో “సాక్ష్యం” చిత్రంతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది.
1998లో నటుడు దిలీప్ను వివాహం చేసుకుని, సినిమాల నుండి విరామం తీసుకుంది. ఈ దంపతులకు మీనాక్షి అనే కుమార్తె ఉంది. 2015లో విడాకుల తర్వాత 2014లో “హౌ ఓల్డ్ ఆర్ యూ.?” చిత్రంతో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
“అసురన్”, “లూసిఫర్” (తమిళం), “తుణివు” (అజిత్తో), “వేట్టయాన్” (రజనీకాంత్తో) వంటి చిత్రాలతో తమిళ సినిమాల్లో కూడా సత్తా చాటింది. “మనసిలాయో” పాటలో ఆమె నృత్యం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ప్రస్తుతం “చతుర్ ముఖం”, “విడుదల పార్ట్ 2” వంటి చిత్రాల్లో నటిస్తోంది.
మంజు కూచిపూడి నృత్యంలో శిక్షణ పొందింది. అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆమె “సల్లాపం” పేరుతో ఒక పుస్తకం రచించింది, అలాగే గాయనిగా కూడా తన ప్రతిభ చాటింది.
మంజు ప్రొఫెషనల్ స్పోర్ట్స్ బైకర్గా కూడా గుర్తింపు పొందింది. 2024లో రూ. 21 లక్షల విలువైన బైక్ కొనుగోలు చేసి వార్తల్లో నిలిచింది. ఇటీవలే విజయ్ సేతుపతితో కలిసి విడుదల 2లో నటించి మెప్పించింది ఈ ముద్దుగుమ్మ