
మెడికల్ కాలేజీలోని పిల్లల వార్డులో భారీ అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల మృతి!
ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీ మెడికల్ కాలేజీలో సిలిండర్ పేలడంతో భారీ అగ్నిప్రమాదం జరిగింది. చిల్డ్రన్స్ వార్డు (ఎన్ఐసియు)లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో పలువురు చిన్నారులు కాలిపోయినట్లు సమాచారం. లోపల నుంచి 10 మంది చిన్నారుల మృతదేహాలను బయటకు తీశారు. మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపడుతున్నారు. సమాచారం అందుకున్న జిల్లా అధికారులు కూడా ఘటనాస్థలికి చేరుకున్నారు. ఝాన్సీలోని మహారాణి లక్ష్మీబాయి మెడికల్ కాలేజీలోని ఎన్ఐసియు (శిశువు) వార్డులో శుక్రవారం(నవంబర్…