
గుండెలు పిండే విషాదం.. లండన్ వెళ్తున్న ఓ కుటుంబం మొత్తం విమాన ప్రమాదంలో అగ్నికి ఆహుతి! అదే చివరి సెల్ఫీ..
అహ్మదాబాద్, జూన్ 13: ఆహ్మదాబాద్లో గురువారం (జూన్ 12) మధ్యాహ్నం 1.38 గంటలకు ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలోని 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది సజీవంగా అగ్నికి ఆహుతయ్యారు. అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ కుటుంబం మొత్తం అహ్మదాబాద్ విమాన ప్రమాదం బలిగొంది. అహ్మదాబాద్లో జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో రాజస్థాన్కు చెందిన 10 మంది మృతి చెందగా.. వృత్తిరీత్యా లండన్లో స్థిరపడాలని బయల్దేరిన డాక్టర్ ప్రతీక్ జోషి, ఆయన…