
ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధం! కేంద్ర ప్రభుత్వానికి అసదుద్దీన్ ఒవైసీ అత్యవసర విజ్ఞప్తి
ఇరాన్, ఇజ్రాయిల్ దాడుల నేపథ్యంలో ఇరాన్, ఇరాక్లలో చిక్కుకున్న భారతీయ పౌరులను వెంటనే ఇండియాకు తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని ఏఐఎంఐఎం చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ భారత ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అత్యవసర విజ్ఞప్తి చేశారు. ఎక్స్ వేదికగా ఆయన ఒక పోస్ట్ పెట్టారు. టెహ్రాన్ విశ్వవిద్యాలయంలోని 140 మంది వైద్య విద్యార్థులతో సహా 1,595 మంది భారతీయ విద్యార్థులు ప్రస్తుతం ఇరాన్లో చిక్కుకున్నారని ఒవైసీ వెల్లడించారు. ఇరాక్లో చిక్కుకున్న 183 మంది భారతీయ…