
PKL 2024: ప్రొ కబడ్డీ లీగ్లో బెంగాల్ వారియర్స్ బోణీ.. యూపీ యోధాస్పై 32-29తో గెలుపు
హైదరాబాద్, 24 అక్టోబర్ 2024: ప్రొ కబడ్డీ లీగ్ 11వ సీజన్లో బెంగాల్ వారియర్స్ బోణీ కొట్టింది. హ్యాట్రిక్ విజయంపై కన్నేసి బరిలోకి దిగిన యూపీ యోధాస్పై బెంగాల్ వారియర్స్ మెరుపు విజయం నమోదు చేసింది. హైదరాబాద్లోని జిఎంసీ బాలయోగి ఇండోర్స్టేడియంలో గురువారం జరిగిన తొలి మ్యాచ్లో యూపీ యోధాస్పై బెంగాల్ వారియర్స్ 32-29తో గెలుపొందింది. ఉత్కంఠ మ్యాచ్లో మూడు పాయింట్ల తేడాతో విజయం సాధించిన బెంగాల్ వారియర్స్.. యూపీ యోధాస్కు సీజన్లో తొలి ఓటమి రుచి…