
గోసంరక్షణపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. రాష్ట్రంలో నాలుగు గోశాలల నిర్మాణానికి శ్రీకారం.. ఎక్కడెక్కడంటే!
రాష్ట్రంలోని గోవుల సంరక్షణపై తెలంగాణ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు గోవుల సంరక్షణపై మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవాలయాల వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో గోవులను దానం చేస్తున్నారు. కానీ వాటికి సరైన నివాస స్థలాలు, వసతులు లేని కారణంగా గోవులు తరచూ మృత్యువాత పడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని…