
Telangana: బీఆర్ఎస్ రజతోత్సవ సభ.. 10 లక్షల మంది వస్తారని అంచనా
తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలేస్తోంది. 25 ఏళ్ల పండగకు ఊరువాడా కదిలింది అంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటివరకు ఒక లెక్క.. వరంగల్ సభ తర్వాత మరోలెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్లబండ్లు, కార్లు, బస్సులు, కాలినడకన వరంగల్కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీ మయంగా మారింది. ఎల్కతుర్తి సభా ప్రాంగణం కొత్త…