PM Modi: అరుణాచల్ ఎప్పటికీ మాదే.. చైనాకు భారత్ కౌంటర్.. కేబినెట్‌, CCS సమావేశాల్లో కీలక నిర్ణయాలు..

PM Modi: అరుణాచల్ ఎప్పటికీ మాదే.. చైనాకు భారత్ కౌంటర్.. కేబినెట్‌, CCS సమావేశాల్లో కీలక నిర్ణయాలు..


ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన భద్రతా వ్యవహారాల కేబినెట్‌ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఆపరేషన్‌ సింధూర్‌ సందర్భంగా భారత్‌పై విషం చిమ్మిన పాక్‌ మిత్ర దేశాలపై చర్యలు ప్రకటించారు. పాకిస్తాన్‌కు డ్రోన్ల సాయం చేసిన టర్కీపై కూడా చర్యలు తీసుకున్నారు. టర్కీ న్యూస్‌ ఛానెల్‌ TRT వరల్డ్‌ ట్విట్టర్‌ ఖాతాపై బ్యాన్‌ విధించింది కేంద్రం .. కేబినెట్‌, CCS సమావేశాల్లో పలు అంశాలపై చర్చ జరిగింది. ఆపరేషన్ సింధూర్‌, కాల్పుల విరమణ తర్వాత పరిణామాలపై చర్చించారు. సెమీ కండక్టర్‌ ఇండస్ట్రీకి ప్రోత్సాహం ఇవ్వాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది.

అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమే..

అంతకుముందు చైనా గ్లోబల్‌ టైమ్స్‌ ట్విట్టర్‌ ఖాతాలపై కూడా బ్యాన్‌ విధించారు. ఆపరేషన్ సింధూర్‌పై భారత్‌కు వ్యతిరేకంగా , పాకిస్తాన్‌కు అనుకూలంగా తప్పుడు ప్రచారం చేశాయి టర్కీ , చైనా మీడియా సంస్థలు. అందుకే భారత్‌ కఠిన చర్యలు తీసుకుంది. పేర్లను మార్చేందుకు గతంలోనూ చైనా ప్రయత్నాలు చేసింది. 2017 నుంచి ఇప్పటికి నాలుగు సార్లు ఇలా కొన్ని ప్రాంతాల పేర్లు మార్చుతూ వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లో భాగమే అంటూ మరోసారి స్పష్టం చేసిన కేంద్రం.. ఇలా భారత భూభాగాల పేర్లు, మ్యాప్‌లు మార్చే హక్కు చైనాకు లేదని కౌంటర్‌ ఇచ్చింది. అంతర్గత భద్రతపై సమావేశంలో చైనా గ్లోబల్‌ టైమ్స్‌పై కూడా నిషేధం విధించినట్టు అమిత్‌షా ప్రకటించారు.

అధునాతన టెక్నాలజీతోనే ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతం..

అధునాతన టెక్నాలజీని ఉపయోగించడం తోనే ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతమయ్యిందన్నారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌. 10 శాటిలైట్ల సాయంతో ఆపరేషన్‌ సింధూర్‌ పూర్తి చేశారు. దీంతో ప్రపంచానికి భారత్‌ సత్తా తెలిసిందన్నారు అశ్విని వైష్ణవ్‌. యూపీ లోని జేవర్‌లో సెమీ కండక్టర్‌ యూనిట్‌ ఏర్పాటుకు కేబినెట్‌ ఆమోదం తెలిపిందన్నారు. యూపీలో తొలి సెమీ కండక్టర్‌ యూనిట్‌ కాగా దేశంలో ఇది ఆరో యూనిట్‌ అని తెలిపారు.

మరోవైపు భారత్‌ అమ్ముల పొది మరో అస్త్రం చేరింది. యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ భార్గవాస్త్రను విజయవంతంగా ప్రయోగించారు. ఒడిశా లోని గోపాలపురం తీరంలో ఈ ప్రయోగం జరిగింది. గాలి లోనే డ్రోన్లను ధ్వంసం చేసే వ్యవస్థను సోలార్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ తయారు చేసింది. మరోవైపు పాకిస్తాన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను భారత్‌ జామ్‌ చేసింది. 23 నిముషాల పాటు పాక్‌కు చైనా ఇచ్చిన ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌ను జామ్‌ చేసింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *