Priyanka Chopra: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా.. కొత్త ప్రయాణమంటూ పోస్ట్

Priyanka Chopra: చిలుకూరు బాలాజీని దర్శించుకున్న ప్రియాంకా చోప్రా.. కొత్త ప్రయాణమంటూ పోస్ట్


ప్రముఖ నటి ప్రియాంకా చోప్రా చిలుకూరు బాలాజీ టెంపుల్‌ను సందర్శించారు. దేవాలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆలయ అర్చకులు ఆమెకు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. సంబంధిత ఫొటోలను ప్రియాంక ఇన్ స్టాలో షేర్ చేశారు. బాలాజీ ఆశీస్సులతో కొత్త జర్నీ మొదలు పెడుతున్నట్టు పోస్ట్‌లో పేర్కొన్నారు.

“శ్రీ బాలాజీ ఆశీస్సులతో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. మనమందరం మన హృదయాలలో శాంతి, శ్రేయస్సు, సమృద్ధిని పొందుదాం. దేవుడి దయ అనంతం. ఓం నమః నారాయణ” అని ఆమె పోస్టులో రాసుకొచ్చారు. చివర్లో రామ్ చరణ్ సతీమణి ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. దీన్ని బట్టి ఉపాసన ఆమెకు దర్శన ఏర్పాట్లు చేసినట్లు అర్థం చేసుకోవచ్చు.

లాస్‌ ఏంజెలెస్‌ నుంచి ప్రియాంక చోప్రా కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ వచ్చారు. మహేశ్‌ బాబు హీరోగా రాజమౌళి డైరెక్ట్ చేస్తోన్న SSMB29 లో ప్రియాంకను హీరోయిన్‌గా తీసుకున్నట్లు కొన్ని రోజులుగా వార్తలు నెట్టింట సర్కులేట్ అవుతున్నాయి. ఆ ప్రాజెక్టు కోసమే ఆమె హైదరాబాద్‌ వచ్చారని చెబుతున్నారు. ఆ సినిమాని ఉద్దేశించే కొత్త ప్రయాణమని చెప్పినట్టు పలువురు నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అయితే సినిమాలో ఆమే హీరోయిన్ అని ప్రకటిస్తూ మూవీ టీం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *