ప్రియాంక అరుల్ మోహన్.. ఈ బ్యూటీ తమిళం, తెలుగు సినిమాల్లో నటిస్తూ మెప్పిస్తుంది. ఆమె నవంబర్ 20, 1994న చెన్నైలో తమిళ తండ్రి అరుల్ మోహన్ జన్మించింది. బెంగళూరులోని పిఇఎస్ యూనివర్సిటీ నుండి బయోలాజికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ పొందింది. ప్రస్తుతం ఆమె చెన్నైలో నివసిస్తోంది.
ప్రియాంక తన నటనా జీవితాన్ని 2019లో కన్నడ చిత్రం “ఒంద్ కథె హెళ్ళ”తో ప్రారంభించింది, దీనిని గిరీష్ జి దర్శకత్వం వహించారు. అదే సంవత్సరం తెలుగులో “నాని గ్యాంగ్ లీడర్”లో నటించింది. విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాని నటించిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
గ్యాంగ్ లీడర్ చిత్రంలో ఆమె నటనకు విమర్శకుల నుంచి మంచి ప్రశంసలు లభించాయి. 2021లో, ఆమె తమిళ చిత్రం “డాక్టర్”తో తమిళ సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టింది, నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో శివకార్తికేయన్తో కలిసి నటించిన చిత్రం. ఈ సినిమా భారీ విజయం సాధించడమే కాకుండా, ఆమెకు SIIMA అవార్డు ఉత్తమ తొలి నటి (తమిళం) గా లభించింది.
ఆ తర్వాత, ఆమె 2022లో “ఎతర్క్కుం తునిందవన్” అనే తమిళ చిత్రంలో సూర్యతో, “డాన్” చిత్రంలో మళ్లీ శివకార్తికేయన్తో నటించింది. ఇటీవలే నానితో “సరిపోదా శనివారం”, ధనుష్తో “కెప్టెన్ మిల్లర్” సినిమాలు చేసింది.
ప్రియాంక మోహన్ తన సహజమైన నటన, అందంతో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఈ బ్యూటీ ఇప్పుడిప్పుడే గ్లామర్ గేట్లు తెరుస్తుంది. తాజాగా సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసిన ఫోటోలు వైరల్ గా మారాయి.