రైల్వేలో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు ఇండియన్ రైల్వే గుడ్న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న అన్నీ రైల్వే రీజియన్లలో భారీగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ పోస్టుల భర్తీకి రైల్వే శాఖకు చెందిన రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు.. అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేస్తుంది. ఈ నోటిఫికేషన్ కింద మొత్తం 6,180 టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది. మొత్తం పోస్టుల్లో టెక్నీషియన్ గ్రేడ్-I సిగ్నల్ పోస్టులు 180, టెక్నీషియన్ గ్రేడ్-III పోస్టులు 6,000 వరకు ఉన్నాయి. అందిన సమాచారం మేరకు జూన్ 28వ తేదీన నోటిఫికేషన్ విడుదలకానుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జూన్ 28వ తేదీ నుంచే ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇతర వివరాలు ఈ కింద చెక్ చేసుకోండి..
సికింద్రాబాద్ సహా.. అహ్మదాబాద్, అజ్మేర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, జమ్ము అండ్ శ్రీనగర్, కోల్కతా, మాల్దా, ముంబయి, ముజఫర్పూర్, పట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సిలిగురి, తిరువనంతపురం, గోరఖ్పూర్.. ఆర్ఆర్బీ రీజియన్లలో టెక్నీషియన్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఆసక్తి కలిగిన అభ్యర్ధులు జులై 28, 2025వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. రాత, వైద్య పరీక్షలు తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంప్లాయ్మెంట్ న్యూస్లో జారీ అయిన షార్ట్ నోటిఫికేషన్ ప్రకారం.. 2025, జులై 1 నాటికి గ్రేడ్ 1 అభ్యర్థులకు వయోపరిమితి 18 నుంచి 33 ఏళ్ల మధ్య ఉండాలి. గ్రేడ్ 3 అభ్యర్థులకు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. అయితే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఉండవల్సిన అర్హతలు, వయోపరిమితితోపాటు ఎంపిక ప్రక్రియ, దరఖాస్తు ఫీజు వంటి తదితర వివరాలు త్వరలోనే విడుదలయ్యే వివరణాత్మక నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. అలాగే రీజియన్ల వారీ ఖాళీలు, విద్యార్హత, రాత పరీక్ష, సిలబస్ తదితర పూర్తి వివరాలు అందులోనే ఉంటాయి.
ఇవి కూడా చదవండి
నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.