టాప్ దర్శకుడు శంకర్ సినిమాలకు ఒకప్పుడు యమా క్రేజ్ ఉండేది. ఆయన సినిమా వస్తుందంటే చాలు ప్రేక్షకులు థియేటర్స్ కు క్యూ కట్టేవారు. శంకర్ దర్శకత్వం వహించిన సినిమాలు అన్ని సూపర్ హిట్స్ గా నిలిచాయి. కానీ ఈ మధ్య శంకర్ డైరెక్షన్ లో వస్తున్న సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోతున్నాయి. ఆయన దర్శకత్వంలో వచ్చిన ఐ సినిమా తర్వాత శంకర్ డైరెక్షన్ లో వచ్చిన సినిమాలన్నీ నిరాశపరుస్తున్నాయి. రోబో 2 సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. రోబో రేంజ్ లో హిట్ అవ్వలేదు. అలాగే రీసెంట్ గా వచ్చిన ఇండియన్ 2 సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాదాపు 22ఏళ్ల క్రితం వచ్చిన ఇండియన్ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకు కొనసాగింపుగా వచ్చిన ఇండియన్ 2 సినిమా ప్రేక్షకులను నిరాశపరిచింది.
ఇండియన్ 2 సినిమా డిజాస్టర్ అవడంతో శంకర్ ఫ్యాన్స్ నిరాశపడ్డారు. ఆతర్వాత రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. రామ్ చరణ్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెరకెక్కింది. కానీ ఈ సినిమా విడుదలై తర్వాత దారుణంగా నిరాశపరిచింది. దాదాపు 500కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఆతర్వాత ఈ సినిమాకు కలెక్షన్స్ పడిపోయాయి.
దాంతో శంకర్ అభిమానులు మరింత నిరాశకు గురయ్యారు. దాంతో ఇప్పుడు శంకర్ నెక్స్ట్ ఎవరితో సినిమా చేస్తారు అన్నది ఆసక్తిగా మారింది. శంకర్ ఏ హీరోతో సినిమా చేస్తారన్నది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారిపోయింది. దాంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. అయితే శంకర్ ఇప్పుడు విక్రమ్ కుమారుడు ధృవ్ తో సినిమా చేస్తున్నాడని తెలుస్తుంది. ఇప్పుడు ఇదే టాపిక్ కోలీవుడ్ లో తెగ వినిపిస్తుంది. శంకర్ విక్రమ్ తో అపరిచితుడు, ఐ సినిమాలు చేశారు. ఇక ఇప్పుడు ఆయన కొడుకుతో సినిమా చేయనున్నారని తెలుస్తుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి