ఇస్రో చేపట్టిన స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్ మిషన్ ) సక్సెస్ అయ్యింది. ఇందులో భాగంగా సోమవారం (డిసెంబర్ 30) శ్రీహరికోటలోని సతీశ్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి పీఎస్ఎల్వీ-సీ 60 నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లింది. స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ (స్పేడెక్స్) పేరిట జంట ఉపగ్రహాలను భూ కక్ష్యలో అనుసంధానం చేసే బృహత్తర ప్రయోగాన్ని ఇస్రో చేపట్టింది. అంతరిక్షంలోనే వ్యోమనౌకలను డాకింగ్, అన్ డాకింగ్ చేయగల సాంకేతిక అభివృద్ధే లక్ష్యంగా ఇస్రో శాస్త్రవేత్తలు ఈ ప్రయోగం చేపట్టారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..