కన్నడనట మిల్కీ బ్యూటీ తమన్నా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తమన్నా పై కన్నడిగులు విమర్శలు కురిపిస్తున్నారు. కానీ కారణం మైసూరు శాండల్ సోప్. ఇటీవలే కన్నడ ప్రభుత్వం మైసూరు శాండల్ సోప్ కు బ్రాండ్ అంబాసిడర్ గా తమన్నాను నియమించింది. దాంతో ఒక్కసారిగా కన్నడ ప్రజలు తమన్నాను విమర్శించడం మొదలు పెట్టారు. కన్నడ ఇండస్ట్రీలో ఇంతమంది స్టార్స్ ఉంటే తమన్నాను కన్నడ సోప్ అయిన మైసూరు శాండల్ సోప్కు తమన్నాను ఎందుకు నియమించారు అంటూ ప్రభుత్వం పై కూడా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది దీని పై స్పందించారు. సెలబ్రెటీలు కూడా తమన్నాను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించడం పై స్పందించారు.
ఇది కూడా చదవండి : అది దా సర్ప్రైజ్..! ఖలేజా మూవీ దిలావర్ సింగ్ భార్య గుర్తుందా.. ఇప్పుడు చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే
కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) మైసూరు శాండల్ సబ్బు బ్రాండ్ అంబాసిడర్గా నటి తమన్నా భాటియాను రూ. 6.2 కోట్లతో రెండేళ్ల కాంట్రాక్టుతో నియమించడం వివాదాస్పదమైంది. ఈ నిర్ణయంపై నటి రమ్యా (దివ్యా స్పందన) తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ, తమన్నా నియామకాన్ని విమర్శించింది. ఈమేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేసింది. కర్ణాటక సంస్కృతి, గుర్తింపును ప్రతిబింబించే స్థానిక కన్నడ నటీమణులను ఎంచుకోవాలని సూచించింది.
ఇవి కూడా చదవండి
ఇది కూడా చదవండి : 17 ఏళ్ల క్రితం తల్లిపాత్ర చేసింది.. ఇప్పుడు అందంతో కుర్రాళ్లను కవ్విస్తుంది..
అలాగే మైసూరు శాండల్ సబ్బు కేవలం ఉత్పత్తి కాదు, కర్ణాటక యొక్క సాంస్కృతిక, చారిత్రక వారసత్వానికి ప్రతీక అని రమ్య ఒక సోషల్ మీడియా పోస్ట్లో పేర్కొంది. ఈ బ్రాండ్ను ప్రోత్సహించడానికి కన్నడ నటీమణులు రష్మిక మందన్న, శ్రీలీలా లాంటి స్థానిక నటీమణులను పరిగణించాలని ఆమె సర్కారుకు సలహా ఇచ్చింది. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది కూడా చదవండి : సినిమా అట్టర్ ఫ్లాప్ అని నిర్మాత బోరున ఏడ్చేశాడు.. కట్ చేస్తా 400రోజులు ఆడి.. ఇండస్ట్రీని షేక్ చేసింది
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.