Telangana: ఆ డీఎస్పీ ఆఫీసుకు వాస్తు దోషం..! ఏం చేశారంటే..

Telangana: ఆ డీఎస్పీ ఆఫీసుకు వాస్తు దోషం..! ఏం చేశారంటే..


రెండు తెలుగు రాష్ట్రాలను అనుసంధానం చేసే హైవేపై ఉన్న డీఎస్పీ కార్యాలమిది. ఈ సబ్ డివిజన్ పోలీసు అధికారిగా వచ్చేందుకు అధికారులు పోటీ పడుతుంటారు. దీంతో ఈ సబ్ డివిజన్ పోలీసు అధికారి పోస్టింగ్ కు డిమాండ్ ఉంటుంది. రాజకీయ నేతల సిఫార్సులతో పోస్టింగ్ తెప్పించు కుంటారు. కానీ ఇపుడు ఈ సబ్ డివిజన్ పేరు చెబితేనే పోలీసు అధికారులు హడలి పోతున్నారు. అయితే డీఎస్పీ కార్యాలయానికి వాస్తు దోషం ఉందని, అందుకే ఇక్కడికి బదిలీపై వచ్చిన అధికారులు వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లిపోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఆ డీఎస్పీ కార్యాలయానికి వాస్తు దోషం పట్టుకుందా..? అయితే తెలుసు కోవాలంటే ఈ స్టోరీస్ చదవాల్సిందే

సూర్యాపేట జిల్లాలోనే అతిపెద్ద పోలీస్ సబ్ డివిజన్ సూర్యాపేట కార్యాలయం. గత ప్రభుత్వ హయాంలో నూతనంగా సూర్యాపేట జిల్లాగా ఏర్పడింది. అప్పటి వరకు ఉన్న పాత భవనంలో డీఎస్పీ కార్యాలయం కొనసాగింది. గత ప్రభుత్వం పాత భవనం స్థానంలో కోట్లాది రూపాయలు పెట్టి కొత్తగా నిర్మించింది. అసలు డీఎస్పీ ఆఫీసు నిర్మాణంలోనే లోపాలు ఉన్నాయని, వాస్తు ప్రకారం బిల్డింగ్ నిర్మాణం జరగలేదని ప్రచారం జరిగింది.

దీంతో నిర్మాణం పూర్తయి రెండేళ్లు గడిచినా.. ఒక్క డీఎస్పీ కూడా దాంట్లో కాలు పెట్టేందుకు ధైర్యం చేయలేక పోయారు. దాంతోనే ప్రైవేటు అద్దె భవనంలోనే డీఎస్పీ ఆఫీసును నిర్వహించారు. సాధారణ ఎన్నికలు ముగిసిన తర్వాత డిఎస్పి నాగభూషణం నూతన కార్యాలయ భవనంలోకి మారేందుకు సిద్ధమయ్యారు. వాస్తు పండితులు కార్యాలయాన్ని పరిశీలించి.. లోపాలను గుర్తించడంతోపాటు దోష నివారణకు ప్రత్యేక పూజలు చేయాలని, కీలకమైన పలు ప్రాంతాల్లో మార్పులు చేయాలని సూచించారు. వాస్తు దోషాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతుండగానే నాగభూషణం ఆకస్మికంగా బదిలీ అయ్యారు.

ఇవి కూడా చదవండి

నాగభూషణం తర్వాత వచ్చిన డీఎస్పీ రవి కొత్త ఆఫీసు ఓపెన్ చేసిన కొద్దిరోజులకే చిక్కుల్లో పడ్డారు. నూతనకల్ మండలం మిర్యాలలో జరిగిన ఓ హత్య కేసులో డిఎస్పిపై ఆరోపణలు వచ్చాయి. దీంతో డీఎస్పీ రవి, తుంగతుర్తి సీఐ శ్రీను పైన వేటుపడింది. ఆయన స్థానంలో డిఎస్పి పార్థసారథిని ఉన్నతాధికారులు అటాచ్ చేశారు. ఆఫీసులో మరికొన్ని వాస్తు మార్పులు కూడా చేశారు. అయినా వారం రోజుల క్రితం డీఎస్పీ తోపాటు సూర్యాపేట సీఐ వీర రాఘవులు ఏసీబీకి ట్రాప్ అయ్యారు. కొత్తగా వచ్చిన డీఎస్పీ పార్థసారధి నెల రోజుల వ్యవధిలోనే ఏసీబీ చేతికి చిక్కి అరెస్టు అయ్యారు.

డీఎస్పీ ఆఫీస్ వాస్తు దోషంతో అధికారులు అవినీతివలలో చిక్కుకుంటున్నారని, కొత్త ఆఫీసుల్లోకి వచ్చాకే రాజకీయ ఒత్తిళ్లు పెరిగాయని ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. వాస్తు దోషం వల్ల రెండు, మూడు నెలల్లోనే ఇద్దరు డీఎస్పీలు, పలువురు సీఐ, ఎస్ఐల పైన వేటు పడిందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *