Tollywood: ‘మా అమ్మ అల్లా దగ్గరకు వెళ్లిపోయింది’.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ హీరోయిన్

Tollywood: ‘మా అమ్మ అల్లా దగ్గరకు వెళ్లిపోయింది’.. కన్నీరుమున్నీరవుతోన్న టాలీవుడ్ హీరోయిన్


టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ సనాఖాన్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. వయసు సంబంధిత సమస్యలతో పాటు గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న ఆమె తల్లి మంగళవారం (జూన్ 24) కన్నుమూశారు. ఈ విషయాన్ని సదరు హీరోయినే సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది. మా అమ్మ అల్లాహ్ దగ్గరకు వెళ్లిపోయిందంటూ ఎమోషనల్ అయ్యింది. ‘నా ప్రియమైన అమ్మ, శ్రీమతి సయీదా, అనారోగ్య సమస్యలతో పోరాడుతూ అల్లాహ్ వద్దకు చేరుకున్నారు. ఇషా నమాజ్ అనంతరం ఓషివారా ఖబ్రస్థాన్‌లో అంత్యక్రియలు జరుగుతాయి. అమ్మ ఆత్మశాంతి కోసం మీరంతా ప్రార్థించాలని కోరుతున్నాను’ అంటూ సనా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. తల్లి మరణంతో తీవ్ర దుఖంలో మునిగిన నటిని పలువురు సినీ ప్రముఖులు ఓదారుస్తున్నారు. అలాగే సినీ అభిమానులు, నెటిజన్లు సనాకు సంతాపం తెలుపుతూ సందేశాలు పంపుతున్నారు.

సనాఖాన్ విషయానికి వస్తే.. కల్యాణ్‌ రామ్‌ కత్తి(2010) సినిమాతో టాలీవుడ్‌ లోకి అడుగు పెట్టిందీ అందాల తార. గగనం, మిస్టర్‌ నూకయ్య సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. హిందీతో పాటు తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లోనూ సినిమాలు చేసింది. ముఖ్యంగా హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన ‘జై హో’ చిత్రం, ‘స్పెషల్ ఆప్స్’ వంటి వెబ్ సిరీస్ లతో పాపులర్ అయ్యింది. అలాగే బిగ్ బాస్ హిందీ షోలోనూ సందడి చేసింది.

ఇవి కూడా చదవండి

భర్తతో సనాఖాన్..

సడెన్ గా సినిమాలకు గుడ్ బై చెప్పి..

హీరోయిన్ గా కెరీర్ పీక్స్ లో ఉండగానే సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేసింది సనాఖాన్. 2020లో దుబాయ్ కు చెందిన ముస్లిం మత గురువు ముఫ్తీ అనాస్‌ సయ్యద్‌ని వివాహం చేసుకుంది. ఇప్పుడీ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ తన సోషల్ మీడియా పోస్టులు, కాంట్రవర్సీ కామెంట్స్ తో తరచూ వార్తల్లో నిలుస్తుంటుందీ అందాల తార. ఆ మధ్యన 5-10 పిల్లల్ని కనాలనుందంటూ షాకింగ్ కామెంట్స్ చేసి ట్రెండ్ అయ్యిందీ ముద్దుగుమ్మ.

ఇద్దరు పిల్లలతో ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *