Tollywood: షూటింగ్ సెట్‏లోకి వచ్చిన చిరుతపులి.. తర్వాత ఏం జరిగిందంటే..

Tollywood: షూటింగ్ సెట్‏లోకి వచ్చిన చిరుతపులి.. తర్వాత ఏం జరిగిందంటే..


ఫిల్మ్ సిటీ సెట్స్‌లో చిరుతపులి మరోసారి కనిపించింది. ఇటీవల స్టార్ ప్లస్‌లో ప్రారంభమైన ‘పాకెట్ మెయిన్ ఆస్మాన్’ సీరియల్ సెట్‌లో నిన్న రాత్రి ఒక చిరుతపులి కనిపించింది. టీవీ9 హిందీ డిజిటల్ వర్గాల నుండి అందిన సమాచారం ప్రకారం.. చిరుత సెట్ లోకి వచ్చినప్పుడు అక్కడ చాలా తక్కువ మంది మాత్రమే ఉన్నారని.. 9 నుండి 9 షిఫ్ట్ ముగిసిన తర్వాత కేవలం సెట్ లో పనిచేస్తున్న ప్రొడక్షన్ యూనిట్ లోని కొందరు సభ్యులు మాత్రమే ఉన్నారట. చిరుతపులి కుక్కలను, కోతులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ సెట్ లోకి వచ్చిందని భావిస్తున్నారు.

ఫిల్మ్ సిటీలోని ఎక్కువ భాగం బోరివలిలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్‌తో అనుసంధానం చేసి ఉంది. అందుకే ఇక్కడ ఎక్కువగా చిరుతలు, కోతులు, జింకలు, పాములు కనిపిస్తుంటాయి. ఫిల్మ్ సిటీలోని సీరియల్స్ సెట్లలో ప్రొడక్షన్ యూనిట్ కోసం ఆహారం తయారు చేస్తారు. దీంతో ఆ ఆహారం కోసం కోతులు, కుక్కలు ఎక్కువగా గుమిగూడతాయి. ఇక వాటిని వేటాడేందుకు చిరుతలు అప్పుడప్పుడు సెట్ లోకి వస్తుంటాయి.

నిజానికి బయట ప్రాంతాల్లో షూటింగ్ చేసేప్పుడు ఫిల్మ్ సెట్ లకు పైకప్పు ఉండదు. కొన్నిచోట్ల సెట్ పైకప్పు స్థానంలో ఇనుపరాడ్లను ఏర్పాటు చేస్తారు. ఎందుకంటే లైటింగ్ పనిని సులభంగా చేయవచ్చు. తర్వాత మొత్తం సెట్‌ను తాటి ఆకులు, ప్లాస్టిక్ సహాయంతో ఈ రాడ్‌లపై కప్పుతారు. పూర్తి పైకప్పు లేకపోవడంతో, చిరుతలు ఇనుప రాడ్లు ఎక్కడం ద్వారా సులభంగా సెట్‌లోకి ప్రవేశిస్తాయి. కానీ ఇప్పటివరకు వారి సెట్‌లో ఎవరిపైనా దాడి జరిగినట్లు వార్తలు రాలేదు. ‘పాకెట్ మెయిన్ ఆస్మాన్’ సెట్‌లో కూడా, చిరుతపులి అదే విధంగా రాడ్‌ని ఉపయోగించి సెట్‌లోకి ప్రవేశించి, ఆపై లోపలికి వచ్చిందని అంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *