హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలో శంకర్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి హల్చల్ చేసింది. కారును ఏకంగా రైలు పట్టాలపై నడిపింది.. నాగులపల్లి నుంచి శంకర్పల్లి వెళ్లే మార్గంలో రైలుపట్టాలపై కారు డ్రైవింగ్ చేస్తూ భయాందోళనకు గురిచేసింది.. దీంతో రైళ్లను సైతం ఆపివేశారు. నాగులపల్లిలో యువతి కారును గమనించిన స్థానికులు అడ్డగించారు. సరిగ్గా ఇదే సమయంలో పట్టాలపై కారును గమనించిన లోకోపైలట్ రైలును ఆపేశారు.. యువతి నిర్వాకంతో గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. దీంతో ఆ మార్గంలో నడిచే రైళ్లు గంటలతరబడి నిలిచిపోయాయి.
అయితే.. యువతి మాత్రం స్పీడ్ గా ట్రాక్పై దూసుకెళ్లింది.. స్థానికులు ఎంత అరుస్తున్నా వినిపించుకోకుండా కారుతో యువతి కారును అలానే నడిపింది. అనంతరం కారు ఆగిపోవడంతో స్థానికులు యువతిని పట్టుకొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. యువతిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నారు. అయితే.. తాము అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానం చెప్పకుండా యువతి మౌనంగా ఉంటుందని పోలీసులు తెలిపారు. ఆ యువతిని చేవేళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రైలు పట్టాలపై కారు నడిపిన యువతి.. ఉత్తరప్రదేశ్ లక్నోకి చెందిన రబిక సోనీగా గుర్తించారు.
వీడియో చూడండి..
శంకర్పల్లి పోలీసులు యువతి వికారాబాద్ రైల్వే పోలీసులకు అప్పగించనున్నారు. అయితే, ఆమె మద్యం లేదా డ్రగ్స్ తీసుకుందా ..? లేదా..? అనే వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.. ఏదైనా మానసిక సమస్యలతో బాధపడుతుండొచ్చని పేర్కొంటున్నారు. యువతికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..