IND vs ENG: కుప్పకూలిన ఇంగ్లండ్.. ఐదో టీ20లోనూ టీమిండియా ఘన విజయం.. 4-1తో సిరీస్ కైవసం
ఐదో టీ20 మ్యాచ్లోనూ ఇంగ్లండ్పై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. నిజానికి ఈ మ్యాచ్ కు ముందే సిరీస్ను ఇప్పటికే టీమిండియా గెలుచుకుంది. అయితే ఐదో మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ కు ఘనమైన ముగింపు పలకాలని టీమిండియా భావించింది. అందుకే తగ్గట్టుగానే ముందుగా బ్యాటింగ్ కు దిగిన భారత్ కు అభిషేక్ శర్మ అద్దిరిపోయే ఓపెనింగ్ ఇచ్చాడు. కేవలం 17 బంతుల్లో హాఫ్ సెంచరీ…